ఉద్యమ బాట పట్టనున్న TS ఉద్యోగులు

SMTV Desk 2018-09-15 10:27:03  telangana employes strike, delhi, TRS

హైదరాబాద్ : ఈ నెల 18 నుండి TS ఉద్యోగులు ఉద్యమ బాట పట్టనున్నారు,తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకే నిరసనలు చేపడుతున్నట్టు వారు వెల్లడించారు అదే విధంగా ముందస్తు ఎన్నికల విధులకు కూడా తాము సహకరించబోమని, తమ సమస్యల పై సెప్టెంబర్ 19 న గవర్నర్ ను కలసి వినతి పత్రం అందజేయబోతున్నామని తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వారి యొక్క ప్రణాళికను స్పష్టం చేశారు. సెప్టెంబర్ 22-26 వరకు జిల్లాలో పర్యటించి 29 న ర్యాలీలు, ధర్నాలు చేపడతామని రాష్ట్ర సర్కారు పై వారి యొక్క అసంతృప్తిని తెలియజెప్పారు అదే విధంగా అక్టోబర్ 2 న ఛలో హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహిస్తామని సమస్యలకు పరిష్కారం జరిగే వరకు ఆందోళనలు ఉదృతం చేస్తూనే ఉంటామని హెచ్చరికను జారీ చేశారు.