గోషామహల్ కు దానం నాగేందర్

SMTV Desk 2018-09-10 18:14:38  Dhanam Nagendhar, TRS, Telangana, Gosha mahal, Raja sing, BJP

* 13వ తేదీన అధికారికంగా ప్రకటించే అవకాశం హైదరాబాద్: గత కొద్ది రోజులుగా టికెట్ కోసం వైయిట్ చేస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్ కు ఎట్టకేలకు టికెట్ దక్కనుంది. గోషామహల్ నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెరాస వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని 13వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.అక్కడ ఇదివరకు బీజేపీ నేత రాజా సింగ్ ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ బలమైన వక్తిని బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో దానం నాగేందర్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన దానం నాగేందర్ పేరు టీఆర్ఎస్ తొలి జాబితాలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో రహస్యంగా భేటీ అయినట్టు కూడా వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి మిగితా అభ్యర్థుల పేర్లను ప్రకటించే పనిలో తెరాస నిమగ్నమైంది.