15న తెలంగాణకు అమిత్ షా

SMTV Desk 2018-09-07 14:29:33  BJP President Amitsha, Telangana

* అదే రోజు బీజేపీ ప్రచారం ప్రారంభం హైదరాబాద్: అసెంబ్లీ రద్దు తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 15న అమిత్‌షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారాని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకుండా కేసీఆర్ అడ్డుపడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను కేసీఆర్‌ అణిచివేసే ప్రయత్నం చేశారని ఎంపీ దత్తాత్రేయ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికే అమిత్ షా రాకకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఏ ఏ ప్రాంతంలో ప్రచారం నిర్వహించాలి. జనసమీకరణ ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే అంశాలతో ఒక ప్రణాళికను రూపొందించే పనిలో బీజీపీ శ్రేణులు నిమగ్నమయ్యారు.