వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ 105 నియోజకవర్గాల అభ్యర్థులను విడుదల చేసారు. ఇదే నియోజకవర్గం నుండి ఫైర్ బ్రాండాగా పేరున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేయబోతున్నారు. అయితే అక్కడ ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన టీఆర్ఎస్ ఈ సారి ఎలాగైన కొడంగల్ స్థానాన్ని తమ ఖాతాలోకి వేయాలనే ప్రయత్నాలు చేస్తుంది.