* ఇక్కడి జలాలు కల్మషం లేకుండా ఉన్నాయి * మానససరోవర యాత్రపై రాహుల్ ట్వీట్ న్యూఢిల్లీ : మానససరోవర సరస్సు జలాలు ఎలాంటి కల్మషం లేకుండా, స్వచ్ఛంగా ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. వివాదాల నడుమ కైలాశ్ మానససరోవర యాత్ర చేపట్టిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ యాత్ర వివరాలు, అనుభవాలను పంచుకుంటూ ట్వీట్ చేశారు. ఈ నీటిని ఎవరైనా తాగవచ్చని .. ఇక్కడ ఎలాంటి ద్వేష భావం లేదని ట్వీట్ చేశారు. అందుకే భారత్లో ఈ నీటిని మనం పూజిస్తామన్నారు. తన ఈ ప్రయాణాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆగస్ట్ 31న రాహుల్ తన కైలాశ్ యాత్రకు శ్రీకారం చుట్టగా 12 రోజుల పాటు ఆయన యాత్ర సాగనుంది.