* తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర * పార్టీలో ఉంచడం ఇష్టంలేకపోతే సస్పెండ్ చేయండి : డీఎస్ నిజామాబాద్: తానూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు చేయలేదని తెరాస నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. కొన్నిరోజులుగా తనపై వస్తున్నా వార్తలపై ఆయన మాట్లాడారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని డీఎస్ ఆరోపించారు. కావాలనే తన కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీకి మోసం చేయలేదని, 50ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని ఈ సందర్బంగా ఆయన అన్నారు. తానూ ఎప్పుడు భాజపాకు అనుకూలంగా మాట్లాడలేదని తెలిపారు. పార్టీ అధిష్టానికి తనను పార్టీలో ఉంచడం ఇష్టం లేకపొతే పార్టీ నుండి సస్పెండ్ చేయండని అన్నారు.