ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

SMTV Desk 2018-09-03 15:16:03  Telangana, Telangana empoyees, DA Increased

తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు డీఏ(కరువు భత్యం) విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వోద్యుగులందరికి ఒక విడత డీఏ చెల్లించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి 1.572 శాతం డిఏ చెల్లించాలనే ఉత్తర్వులపై సిఎం సోమవారం సంతకం చేశారు. ఈ పెంపుతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 27.24 శాతానికి చేరుకుంది. సీఎం నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తమ అభ్యర్థన మేరకు స్పందించి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.