సెప్టెంబర్ 5న టీడీపీ కీలక సమావేశం

SMTV Desk 2018-09-02 17:54:58  TDP, AP CM, september 5

ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పార్టీ నాయకులు కొందరితో సమావేశమయ్యారు. నాయకులను, శ్రేణులను ఇప్పటినుంచే ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ, ప్రభుత్వ పనితీరును సమీక్షించుకుని కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ నెల 5న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సమావేశం జరగనుంది. ఇంకా నిర్వహించాల్సిన ధర్మపోరాట సభలు, క్రైస్తవ, మైనారిటీ, గిరిజన, బీసీ సభల నిర్వహణ తదితర అంశాలపై కార్యాచరణ సిద్ధం చేస్తారు. ధర్మపోరాట సభను ఈ నెలలో పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహిస్తారు. అక్టోబరులో రాజమహేంద్రవరంలో బీసీ తేజం సభ నిర్వహిస్తారు. గిరిజన గర్జన సభను విజయనగరం జిల్లాలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 6 నుంచి శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో జిల్లాలవారీగా పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు.