రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

SMTV Desk 2017-07-17 16:39:28  Three, killed, in, road, accident

ఆమనగల్లు, జూలై 17 : రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రం సమీపంలో దొంగ రోడ్డు చల్లంపల్లి కూడలి దగ్గర ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యుల్లో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చంద్రయ్య అతని భార్య సరిత ఇద్దరు కుమారులు వంశీ, చరణ్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఆసుపత్రికి పని మీద వెళ్లి వస్తున్న సమయంలో తలకొన్నపల్లి రహదారి పై ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ బైక్ ను ఢీ కొట్టడంతో చంద్రయ్య (35) అతని కుమారులు వంశీ(8), చరణ్(6) అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రయ్య భార్య సరిత తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.