హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ సభలు పెట్టి ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని న్యాయవాది, ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై రేపు హైకోర్టు విచారించనుంది. సెప్టెంబర్ 2న ఘనంగా సభ తెలంగాణ రాష్ట్ర సమితి తలపెట్టిన ప్రగతి నివేదన సభను ఆపాలని ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత నాలుగున్నరేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించేందుకు తెరాస ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.