‘అంతకు మించి’ సినిమా కొత్త ట్విస్ట్

SMTV Desk 2018-08-28 14:03:29  Anthaku Minchi, Hero sathish Jai

యాంకర్ రష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అంతకు మించి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం హీరో, నిర్మాత సతీష్ జాయ్ తనను మోసం చేశాడని, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సినిమా విడుదల చేశాడని గౌరీ శంకర్ ప్రసాద్ అనే నిర్మాత హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఇది ఇలా ఉండగా హీరో జై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రం గురించి మీడియాలో వస్తున్న కథనాలకు తాజాగా ప్రెస్ మీట్ లో సతీష్ జై వివరణ ఇచ్చాడు.అంతకు మించి చిత్రం విడుదలైనప్పటి నుంచి వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి హీరో, నిర్మాత తానే అని సతీష్ జై వివరణ ఇచ్చాడు. నాపై కేసు పెట్టిన వ్యక్తి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వివాదంపై అంతకు మించి హీరో సతీష్ జై మీడియా సమావేశంలో మాట్లాడాడు. మోసపూరితంగా తన సినిమాని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించి అంతకు మించి సినిమాని చంపేశారు. ఈ వివాదంలో మీడియా మొత్తం నాకు అండగా నిలవాలి అని జై కోరాడు. గౌరీకృష్ణ చేస్తున్న ఆరోపణలన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. అతను రూ. 50 లక్షలు పెట్టాడన్నది అవాస్తవమని, కన్నా, భాను, సతీష్ అనే ముగ్గురు కలిసి పెట్టుబడి పెట్టారాని చెప్పారు. తనకూ, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని ఏడాది క్రితమే ఈ ముగ్గురికీ గౌరీశంకర్ ‘అంతకు మించి’ సినిమాను రాసిచ్చేశారని హీరో సతీష్ తెలిపారు. ఆ ఏడాది తర్వాత తాను సినిమాను పూర్తి చేసి, ఈ నెల 24న విడుదల చేశానని సతీష్ చెప్పారు.