తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లి పర్యటనలో భాగంగా కేసిఆర్ ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులను కలవనున్నారు. మూడు రోజుల పాటు సిఎం పర్యటన కొనసాగనుంది. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలు, హైకోర్టు విభజన, రీజనల్ రింగ్ రోడ్ నిధులు, రక్షణ స్థలాల అప్పగింతపై కేసీఆర్ కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అలాగే కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదించాలని కోరనున్నారు. సిఎం కేసిఆర్తో పాటు సీఎస్ ఎస్కే జోషి, ఉన్నతాధికారులు ఢిల్లి వెళ్లనున్నా