కవితను మళ్లీ గెలిపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా..

SMTV Desk 2018-07-06 16:05:17  komiti venkat reddy, komiti venkat reddy challenge, trs vs congress, congress

నిజామాబాద్, జూలై 6 ‌: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి కేటీఆర్, ఎంపీ కవితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ ఎంపీగా కవితను మళ్లీ గెలిపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటీఆర్ సవాలు చేస్తున్నారని, ఆమె చెల్లెను గెలిపించుకుంటే తాను రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. అంతే కాకుండా శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల వల్ల విద్యావ్యవస్థ గాడితప్పుతోందన్నారు. ఎంసెట్ కుంభకోణంలో ఆ సంస్థల డీన్‌ను అరెస్టు చేశారని, అందువల్ల ఆ సంస్థల అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయా సంస్థల్లో కేసీఆర్ కుటుంబానికి 40శాతం వాటా ఉందని ఆరోపించారు.