హైదరాబాద్, జూలై 1 : రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త టి.సుబ్బిరామిరెడ్డి మనవడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్ర మాజీ మంత్రులు బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు, హరీశ్రావు, జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ కవిత, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి దంపతులు, రామ్చరణ్ దంపతులు, బ్రహ్మానందం, వాణిశ్రీ, జీవిత రాజశేఖర్ దంపతులతో పాటు తదితరులు హాజరయ్యారు.