చెన్నై, జూలై 14 : ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అందరూ రుచి చూశారు. అలాంటి రెహమాన్ తన కచేరీతో అభిమానులను నిరాశపరిచారట. రెహమాన్ తన 25 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా లండన్లోని వెంబ్లీ స్టేడియంలో కచేరీ నిర్వహించారు. కచేరిలో రెహమాన్ ఎక్కువగా తమిళ పాటలే పాడడంతో ఉత్తరాది భారతీయులు నిరాశ చెందారట. అంతేకాకుండా కొందరు కార్యక్రమం పూర్తవకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోయినట్లు చిత్రవర్గాలు సోషల్మీడియాలో పేర్కొన్నాయి. రెహమాన్ నుంచి ఇలాంటి తీరు అస్సలు ఊహించలేదంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు రెహమాన్కి తమిళనాడులోనూ మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఇందులో ఆయన తప్పేమీ లేదని మద్దతిస్తున్నారు.