మాదాపూర్ లో యువతి బలవన్మరణం..

SMTV Desk 2018-06-28 16:49:38  madhapur software suicide, melange tower suicide issue, hyderabad, madhapur ps

హైదరాబాద్‌, జూన్ 28: మాదాపూర్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిలాంజ్ టవర్‌పై నుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకొంది. మాదాపూర్ మిలాంజ్ టవర్‌ తొమ్మిదో అంతస్తులోని ప్రైమ్ ఎరా మెడికల్ టెక్నాలజీ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రావణి ఈ రోజు ఉదయం ఆఫీస్ కు వచ్చారు. అయితే, కాసేపటికి బాల్కనీ వద్దకు వచ్చి ఓ స్టూల్‌ను తీసుకొని అక్కడి నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అనారోగ్యం సమస్యల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.