కర్ణాటక, జూన్ 7 : తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో హిందీ చిత్రం ‘క్వీన్’ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మైసూర్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. కథ ఒక్కటే..! అందులోని పాత్రాలు ఒక్కటే..! కానీ, నటించే వారే వేరు. వాళ్ళు మాట్లాడే భాష వేరు. హిందీ హిట్ ‘క్వీన్’ని తమిళంలో కాజల్ అగర్వాల్, తెలుగులో తమన్నా, కన్నడలో పరుల్ యాదవ్ ముఖ్యతారలుగా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాల షూటింగులు మైసూర్లో జరుగుతున్నాయి. విమానశ్రయంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇన్సెట్ ఫొటోలు లొకేషన్లో తీసినవే. సేమ్ లొకేషన్.. సేమ్ స్ర్కిప్ట్.. ఫ్రేమ్లో హీరోయిన్లు మారుతున్నారంతే. తమిళ, కన్నడ వెర్షన్స్ (‘ప్యారిస్ ప్యారిస్’, ‘బటర్ఫ్లై’) కి రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’కి ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు.