హైదరాబాద్, జూన్ 6 :నగరంలోని అబిడ్స్లో బహుళ అంతస్తుల భవనం నుంచి దూకి ఓ యువతి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మయూరి కాంప్లెక్స్ ఐదో అంతస్తు నుంచి ఓ గుర్తు తెలియని యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినఅబిడ్స్ పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలిని బర్కత్పురాకు చెందిన జస్లిన్ కౌర్(18)గా పోలీసులు గుర్తించారు. నిన్న విడుదలైన నీట్ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. జస్లిన్ కౌర్ భవనం ఎక్కడం.. పై అంతస్తు నుంచి కిందికి దూకడం అంతా సీసీ కెమెరాలకు చిక్కింది. తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.