హైదరాబాద్, జూన్ 5 : మెగా పవర్ స్టార్ భార్య ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లోనే ఉంటారు. తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ చక్కటి ఫొటోను పోస్ట్ చేశారు. తన కోసం చరణ్.. పువ్వులు కొనడానికి మార్కెట్కు వెళ్లారట. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా రంగు రంగుల పూలను కొని వాటిని ఆప్యాయంగా చూస్తున్న ఫొటోను షేర్ చేశారు. "సో స్వీట్. మిస్టర్ సి నాకోసం పువ్వులు కొనడానికి షాపింగ్కి వెళ్లారు. మనసున్న మనిషి" అని ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు నెటిజన్ల నుండి తెగ కామెంట్స్ వస్తున్నాయి. ఎంతో అమాయకంగా, క్యూట్ లుక్స్ తో కనిపిస్తున్నారని, స్వచ్ఛమైన ప్రకృతికి సాక్ష్యంగా నిలిచే పూలు ఆయన చేతిలో క్షేమంగా ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ లోనూ నటించనున్నారు.
Sweetness personified - when #MrC goes flower shopping for me. #ramcharan #kindhearted pic.twitter.com/KRnOGNMzFq
— Upasana Kamineni (@upasanakonidela) June 4, 2018