ముంబై, జూన్ 4 : బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్- 2" సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న అనన్య పాండే షూటింగ్ లో గాయపడ్డట్లు సమాచారం. చిత్రీకరణలో భాగంగా ఈ అమ్మడు కారు నడుపుతున్న క్రమంలో అదుపుతప్పి సరాసరి చెట్టును ఢీకొన్నారు. అనుకోని ఈ హఠత్పరినామానికి ఒక్కసారిగా షాక్ కి గురైందట అనన్య. కాని పెద్దగా గాయలేమి తగలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయినా ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్లు తెలిపింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మిస్తుండగా.. పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తుండగా అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.