ముంబై, జూన్ 1 : సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బెట్టింగ్ స్కాంలో అర్బాజ్ ఖాన్కు సమన్లు అందాయి. ఈ మేరకు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. థాణే పోలీసులు ఈ కేసులో విచారణకు హాజరుకావాలని అర్బాజ్ ఖాన్కు నోటీసులు ఇచ్చిందని సదరు రిపోర్టులో పేర్కొన్నారు. టాప్ బుకీల ద్వారా అర్బాజ్ బెట్టింగ్కు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులకు దొరికిన సోనూ జలాన్ అనే బుకీ విచారణలో అర్బాజ్ పేరును బయటపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, శనివారం విచారణకు అర్బాజ్ హాజరుకావాల్సివుంది. ‘దబాంగ్’, ‘దబాంగ్ 2’ చిత్రాల్లో అర్బాజ్ ప్రతినాయక పాత్రలు పోషించారు. సల్మాన్ నటించిన పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ చిత్రంలో అర్బాజ్ విలన్ పాత్ర పోషించారు. ఈ వార్తలపై సల్మాన్, అర్బాజ్ ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు.