ముంబై, మే 27 : బాలీవుడ్ భామ సోనమ్ కపూర్.. తను చెల్లెలు జాన్వికి సాయపడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. తను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో పిన్ని శ్రీదేవి తనకెంతో సహాయం చేశారని ఆరోజుల్ని గుర్తుచేసుకున్నారు. త్వరలో సోనమ్ నటించిన "వీరే ది వెడ్డింగ్" సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. సోనమ్, కరీనా కపూర్, స్వరాభాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా జూన్1న విడుదల కాబోతోంది. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. "సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినపుడు పిన్ని శ్రీదేవి నాకెంతో సహాయం చేశారు. తనతో అన్ని విషయాలు పంచుకునేదాన్ని. నాకు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం నా చెల్లెలు జాన్వి కపూర్ సినిమాల్లోకి వచ్చింది. తనకు నేను చెప్పింది ఒక్కటే.. ఇక్కడ భుజం తట్టి ప్రోత్సహించేవారి కంటే విమర్శించేవారే ఎక్కువగా ఉంటారు.. వారు అనే విషయాలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని. ఇప్పుడు జాన్వీ అదే పాటిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు.