హైదరాబాద్, మే 25 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ మొబైల్ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. సమాజానికి ఉపయోగపడే ఫౌండేషన్ ను త్వరలోనే ప్రారభించనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా నేనూ, నాన్న కలిసి ఛారిటీ గురించి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగానే నేను మళ్లీ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు ఒప్పుకొన్నానంటూ రామ్ చరణ్ పేర్కొన్నారు. "హ్యాపీ మొబైల్స్" బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నానని.. దీని ద్వారా వచ్చే ఆదాయంలో 15శాతం కొత్తగా ఏర్పాటు చేయబోయే ఛారిటీకి కేటాయిస్తానంటూ తెలిపారు. త్వరలోనే ఫౌండేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనకు సోషల్ మీడియాలో అకౌంట్ లేదని.. ఎక్కువగా వాట్సప్ను వాడుతుంటానన్నారు. అలాగే రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ కి కుటుంబపరంగా అన్నివిధాలుగా సపోర్ట్ ఉంటుందని.. ఆయన నుండి పిలుపు వస్తే జనసేన తరపున ప్రచారం చేయడానికి కూడా సిద్దంగా ఉంటానని చెప్పుకొచ్చారు.