హైదరాబాద్, మే 19 : హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "పడి పడి లేచే మనసు". శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హాస్య నటుడిగా గుర్తింపు పొంది హీరోగా వెండి తెరపై మెరిసిన కథానాయకుడు సునీల్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వరుస సినిమాలలో ఆయన నటిస్తున్నారు. అల్లరి నరేష్ హీరోగా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో, అలాగే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమాలోనూ ఆయన కనిపించనున్నారట. ఇటీవలే కలకత్తాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుతోంది. త్వరలోనే సునీల్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.