అట్రాసిటీ చట్టం పరిరక్షణ సభలకు అనుమతివ్వాలి: వీహెచ్

SMTV Desk 2018-05-04 15:31:18  Ap, Telangana, governments, atrocity act, meeting

హైదరాబాద్, మే 4: అట్రాసిటీ చట్టం పరిరక్షణ నిమిత్తం గుంటూరు, వరంగల్ లో తలపెట్టిన సభలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతివ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) కోరారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. అవినీతిపరులైన యడ్యూరప్ప, ‘గాలి’ సోదరులకు టిక్కెట్లు ఇచ్చిన బీజేపీకి నీతి గురించి ప్రస్తావించే అర్హత లేదని దుయ్యబట్టారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు