హైదరాబాద్, ఏప్రిల్ 30 : దర్శకుడు కొరటాల శివపై లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రముఖ కథానాయకుడు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "భరత్ అనే నేను" చిత్రం చూసి జేపీ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన కుటుంబం, స్నేహితులతో కలిసి ఈ సినిమా చూశానని పేర్కొన్నారు. కొరటాల శివ ఒక చక్కటి ప్రయత్నం చేశాడని.. ప్రజలను ఆలోచింపజేసేలా ఉందని కొనియాడారు. "నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశా. చట్ట నిబంధనలు, స్థానిక పరిపాలన అనే రెండు బలమైన సందేశాలను కలిసి మాస్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందించారు. కొరటాల శివ ధైర్యానికి, విజయవంతమైన కష్టానికి కుడోస్" అని జేపీ ట్వీట్ చేశారు. ఈ విషయంపై కొరటాల శివ స్పందిస్తూ.."మీలాంటి వ్యక్తుల దగ్గర నుండి ప్రశంసకు దక్కడం ఆనందంగా ఉంది. మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి మీ ఆవాసం ఉంది" అంటూ ట్వీట్ చేశారు. "భరత్ అనే నేను" చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.