హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ఐకాస ఛైర్మన్ పదవికి కోదండరాం రాజీనామా చేశారు. తెలంగాణ జనసమితిలో చేరుతున్నందున ఐకాస అధ్యక్ష వదిలేస్తున్నట్టు ఆయన చెప్పారు. గన్పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించి రాజీనామా పత్రాన్ని ఐకాస కన్వీనర్ రఘుకు అందజేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ అప్పటి స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకు ఐకాస అధ్యక్ష పదవి స్వీకరించానని తెలిపారు. 2009 నుంచి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జనసమితిలోనూ ఇంతకు ముందు పాత్రే పోషిస్తానని స్పష్టం చేశారు.