భద్రాచలం, ఏప్రిల్ 27: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు రోజుల క్రితం ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో 39 మందిని కోల్పోయిన మావోలకు భద్రత దళాలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ పరిధి యాపా ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కూంబింగ్కు వెళ్లిన పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఘటనాస్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్కు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.