హైదరాబాద్, ఏప్రిల్ 26 : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయికుడిగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ విషయాన్ని హీరో రామ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్పై ఈ సినిమాను రవికిశోర్ నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచరస్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ "ఏప్రిల్ 26న గురువారం హైదరాబాద్లో నిరాడంబరంగా పూజా కార్యక్రమాలను నిర్వహించాం. మే 7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మే నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలోని సుందరమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. విదేశాల నుంచి తిరిగి వచ్చాక కశ్మీర్, లడఖ్లో భారీ షెడ్యూల్స్ చేస్తాం. మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడిస్తాం" అని తెలిపారు.