హైదరాబాద్, ఏప్రిల్ 24: నగర శివారులోని పటాన్చెరు పారిశ్రామికవాడలోని అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై మంత్రి స్పందిస్తూ ప్రమాదంలో 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. మంటలను సకాలంలో అదుపులోకి తీసుకురావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేరని తెలిపారు. షాట్ సర్క్యూట్ వలనే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. ఎందరో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అగర్వాల్ రబ్బరు పరిశ్రమ అగ్నిప్రమాదంలో బుగ్గి కావడం పట్ల నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సంస్థ గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.30కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. దాని నుంచి తేరుకునేలోపే మరో ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా వీలైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు.