గవర్నర్ తీరు పై మండిపడ్డ వీహెచ్

SMTV Desk 2018-04-24 16:13:32  Congress senior leader, V.Hanmanth Rao,serious, Governor Narasinhan,

హైదరాబాద్, ఏప్రిల్ 24: రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన గవర్నర్ నరసింహన్... రాజకీయ పార్టీలకు మధ్యవర్తిగా మారారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీకి టీడీపీ మద్దతు కూడగట్టడం కోసం.. గవర్నర్‌ ఏపీకి వెళ్లి చంద్రబాబుతో మాట్లాడారని విమర్శించారు. గవర్నర్ పని మానేసి మధ్యవర్తిగా పని చేస్తున్నారని ఆరోపించారు. తాము ప్రజల పక్షాన పోరాడుతుంటే గవర్నర్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల నివేదిక పేరిట గవర్నర్‌ ఢిల్లీ వెళ్తున్నారని వీహెచ్ విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.... సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని వీహెచ్‌ ధీమా వ్యక్తం చేశారు.