ముంబాయి, డిసెంబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిశాయి. ఆరంభంలో అమ్మకాలు పెరిగినా, ఆ తరువాత తగ్గాయి. నాటి ట్రేడింగ్ లో 69 పాయింట్ల నష్టంతో 32,800 వద్ద ప్రారంభించి, 67 పాయింట్లు నష్టపోయి 32,802 వద్ద స్థిరపడింది. నిఫ్టీ10 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇక మెటల్, రియల్టీ, ఐటీ, ఆటో సెక్టార్లు, నష్టపోయాయి. రేపు జరగబోయే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించనున్నట్లు సమాచారం.