2025 నాటికి లక్ష అంకుర సంస్థలు...

SMTV Desk 2017-12-04 11:29:14  Manipal Global Education Chairman TV Mohandas Pai, Lecturers

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అంకుర సంస్థలపై మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ స్పందించారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా లక్ష అంకుర సంస్థలు ఏర్పాటవుతాయని అన్నారు. తద్వారా 3.25 మిలియన్ల మంది ఉపాధి పొందుతారని, వాటి విలువ 500 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని తెలిపారు. ఏటా 7వేల సంస్థలలో యువత, టెక్నాలజీ సాయంతో సమర్థంగా పరిష్కరిస్తోందని, ఆవిష్కరణల వల్ల భారత్‌ మరింతా సమర్ధవంతంగా తయారవుతుందని పేర్కొన్నారు.