ముంబై, అక్టోబర్ 16 : టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇటీవల జియో తో కొన్ని కోట్ల మంది వినియోగదారులకి చేరువైంది. అయినప్పటికీ జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలను చవిచూసింది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తొలిసారిగా జియో ఆదాయాలను వెల్లడించారు. వడ్డీలు, పన్నులు చెల్లించక ముందు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ రూ. 260 కోట్ల లాభాలను ఆర్జించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే మార్కెట్ విశ్లేషకులు జియోకు రూ.2వేల కోట్ల దాకా నష్టాలు రావొచ్చని అంచనా వేయగా.. కేవలం రూ.271 కోట్లు మాత్రమే నష్టం రావడం విశేషం.