హైదరాబాద్, మార్చి 14 : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని బీజేపీ బలిపశువు చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. కేంద్రం నుండి టీడీపీ నేతలను తొలగించిన చంద్రబాబు ఎన్డీయేలో మాత్రం ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పక్షాలను కలుపుకొని పోరాడాలని సూచించారు. ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సహా అందరిని సస్పెండ్ చేయడం సరికాదన్న ఆయన.. కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందన్నారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.