నెల్లూరు, ఫిబ్రవరి 24 : నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ఎస్సీ కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు ఈ రోజు మంత్రి నారాయణ భూమిపూజ చేశారు. ఎస్సీల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితవాడలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గత ప్రభుత్వాలు, కొన్ని జాతీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగానే పరిగణించాయని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం ఎస్సీ సబ్ప్లాన్ కింద రూ.19వేల కోట్లు కేటాయించిందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.