అమరావతి, జనవరి 29 : వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తానే స్వయంగా తెలుసుకోవడానికి గతేడాది నవంబరు 6న ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమాధి నుంచి కాలినడకన రాష్ట్ర పర్యటనకు బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయికి చేరింది. నేడు 74వ రోజు కాగా నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఆయన 1000 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సైదాపురంలో ఏర్పాటుచేసిన పైలాన్ను ఆవిష్కరించిన జగన్కు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.