తిరుమల, జనవరి 20: ఏడు కొండల వెంకట రమణ గోవిందా గోవిందా.. అంటూ బాజపా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో బాజపా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుతో పాటు పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. పీఎసీ చైర్మన్ బుగ్గా రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, మాజీ క్రికెటర్ కృష్ణమచారి శ్రీకాంత్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ సిబ్బంది వారికి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.