విజయవాడలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..

SMTV Desk 2018-01-09 16:25:53  kcr photo ksheera abhishekam, vijayawada, yadav cast persons.

విజయవాడ, జనవరి 9 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి విజయవాడలో క్షీరాభిషేకం చేశారు. యాదవ భవన్ నిర్మాణానికి పది ఎకరాలు స్థలం, నిధులు కేటాయించడ౦ అభినందనీయం అంటూ యాదవ యువభేరి ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకం నిర్వహించారు. అలాగే యాదవ కులస్తులకు రాజ్యసభ సీటు అవకాశం ఇస్తానని కేసీఆర్ ప్రకటించడం హర్షనీయమన్నారు. రాజ్యసభ సీటుకు అభ్యర్థిని ప్రకటించేవరకు రాష్ట్ర వ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహిస్తామని, అనంతరం అమరావతి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తామని అఖిల భారత యాదవ మహాసభ కృష్ణా జిల్లా అధ్యక్షులు బొద్దు రమేష్ యాదవ్ ప్రకటించారు.