విజయవాడ, జనవరి 9 : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అదనపు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సిద్దమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నుంచి రాకపోకల కోసం 5 వేల ప్రత్య్జేక సర్వీసులు నడుపనుంది. ప్రయాణికులకు సహకరించేందుకు ఆర్టీసీ అధికారులు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు ఆర్టీసీ ప్రతి రోజు వందకు పైగా అదనపు సర్వీసులు నడుపనుంది. రిజర్వేషన్ చేయించుకున్న వారికి బస్సు బయలుదేరే సమయాన్నిసంశిక్త సందేశాల రూపంలో అప్రమత్తం చేయనున్నారు. స్మార్ట్ ఫోన్ లో ఆర్టీసీ మొబైల్ ఆప్ ఉన్నవారు బస్సు అక్కడ ఉందో జీపీఎస్ ద్వారా తెలుసుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు.