వైసీపీలోకి విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు

SMTV Desk 2018-01-08 16:02:02  ycp, join, kumbha ravibabu, jagan, padayatra

చిత్తూరు, జనవరి 08: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న రాజన్న తనయుడికి మద్దతుగా నిలిచేందుకు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాలతో వారిని వైఎస్‌ జగన్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటం చేయాలనీ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం రవిబాబు మాట్లాడుతూ... గిరిజనులంతా వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే గిరిజన హక్కులు రక్షించబడతాయని వ్యాఖ్యానించారు.