1385 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ : గంటా

SMTV Desk 2018-01-08 15:49:52  educational minister, ganta srinivasara rao, assistent professor posts.

అమరావతి, జనవరి 8 : ఈ విద్యా సంవత్సరంలో బీఈడీ, డీఈడీ చదువుతున్న వారికి టెట్‌ రాసేందుకు అవకాశం కల్పించామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రొఫెసర్, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా మొత్తం 1385 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బీటెక్ అనంతరం బీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఇంధన, లాజిస్టిక్స్, అతిథ్య రంగాల్లో యూనివర్శిటీలు రానున్నాయని వెల్లడించారు.