విజయవాడ, జనవరి 8 : ముగ్గురు కానిస్టేబుల్లా అప్రమత్తత పెను ప్రమాదాన్ని తప్పించింది. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని కృష్ణాలంక రాజీవ్ సమీపంలో బ్లేడ్ బ్యాచ్ని పట్టుకునేందుకు వెళ్లిన ముగ్గురు కానిస్టేబులు రైలు పట్టాలను కలిపేందుకు వేసిన జాయింట్ ఊడిపోయిన విషయాన్ని గమనించారు. అప్పటికే హౌరా నుంచి కొరబా వెళ్లే రైలు వస్తుండటంతో ఎరుపురంగు వస్త్రం వూపి రైలును నిలిపివేశారు. ఈ మేరకు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉన్న కానిస్టేబుళ్లు చక్రవర్తి, నాగభూషణం, నాగేశ్వరరావులను సమయస్ఫూర్తిని రైల్వే అధికారులు అభినందించారు.