దెందులూరు, జనవరి 7 : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు చెరువులో గల్లంతయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో వీరంతా చెరువులో ఈత కొట్టేందుకు వచ్చారని సమాచారం. అయితే వారిలో ఓ విద్యార్థి మృత దేహం తేలుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి అతడ్ని విజయశంకర్గా గుర్తించారు. అయితే మిగతా ముగ్గురు ఏమయ్యారనే దాని పై సందేహాలు నెలకొన్నాయి. ఒక్కడే చెరువులోకి దిగాడా? లేక అందరూ మునిగిపోయారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. వీరంతా వట్లూరు రామచంద్ర కళాశాలలో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. కనిపించకుండా పోయిన వారిని హరికృష్ణ, పరశురాం, సాయిగా గుర్తించారు. మిగిలిన ముగ్గురి జాడ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.