ప్రధాని మోదీతో ఖరారైన చంద్రబాబు భేటీ

SMTV Desk 2018-01-06 14:21:23  chandrababu, modi, meet, appointment, January 12

అమరావతి, జనవరి 06: ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ ఖరారైంది. జనవరి 12న చంద్రబాబుతో భేటీ అవుతున్నట్లు స్వయంగా మోదీయే ఆంధ్ర టీడీపీ, బీజేపీ ఎంపీలకు తెలిపారు. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం, విభజన హామీలు, అసెంబ్లీ స్థానాల పెంపు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సుమారు ఏడాది తరువాత ఇరువురు భేటీ అవుతున్నారు. ఇటీవలే టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధ౦ నేపధ్య౦లో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు జరుగనున్న భేటీ సందర్భంలో పలు కొత్త ప్రాజెక్టులను ఏపీకి ప్రకటించాలని మోదీని చంద్రబాబు కోరే అవకాశం ఉంది.