చిత్తూరు, జనవరి 06: ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నేడు 54వ రోజు పాదయాత్ర జిల్లాలోని గొడ్లవారిపల్లి శివారు నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో పాల్గొని జగన్ అడుగులో అడుగు వేసేందుకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జగన్ యాత్ర సాగిస్తున్నారు. ఈ రోజు శ్రీనివాసపురం, చాల్లవారిపల్లి మీదుగా కల్లూరు వరకూ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. కల్లూరులో మైనార్టీల ఆత్మీయ సదస్సులో వైఎస్ జగన్ పాల్గొననున్నారు.