దుర్గగుడి వివాదంపై కమిటీ విచారణ ప్రారంభం

SMTV Desk 2018-01-05 16:25:00  The committees inquiry into theover the issue dhurga temple vijayawada

విజయవాడ, జనవరి 5 : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన ఉన్న దుర్గమ్మ గుడిలో గతేడాది డిసెంబర్ 26న రాత్రి ఆలయాన్ని ఆలస్యంగా మూయడంతో, ఆ సమయంలో దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయన్న వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం ఈ విషయంలో దేవాదాయశాఖ తరుపున అలాగే, పోలీలుశాఖ తరుపున రెండు కమిటీలను నిర్వహించి నిజనిర్ధరణ విచారణ చేపట్టింది. అయితే అర్చకులను, ఉద్యోగులను ఈ దుర్గగుడి కార్యాలయంలోనే విడివిడిగా కమిటీ విచారిస్తుంది. కాగా, ఈ దర్యాప్తుకు దుర్గగుడి ప్రధాన అర్చకుడు బద్రీనాథ్‌బాబు సహా ఇతర అర్చకులు హాజరయ్యారు.