అమరావతి, జనవరి 5 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. జన్మభూమి నోడల్ అధికారులతో సహా ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల నుండి వచ్చే ఏ ఒక్క ఫిర్యాదును కూడా పెండింగ్ లో పెట్టకూడదని, అన్నింటిని సరైన సమయంలో పరిష్కరించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమం మొత్తం ప్రపంచాన్ని ఆకర్షిస్తుందని, అందరు గర్వపడాల్సిన విషయం అన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని తెలిపారు.