ఈ నెల 30న విజయవాడకు వెళ్లనున్న ఉపరాష్ట్రపతి...

SMTV Desk 2017-12-28 10:41:49  Vice-President n. venkayyanaidu, going vijayawada on 30th

విజయవాడ, డిసెంబర్ 28 : ఈ నెల 31న భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విజయవాడలో జరిగే స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఈ నెల 30న రాత్రి 9గంటలకు విజయవాడ విమానాశ్రయానికి బయలుదేరానున్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో రాత్రి బస చేస్తారు. మరుసటిరోజు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 9.15 నుంచి 9.45 వరకూ సీనియర్‌ జర్నలిస్టులతో జరిగే అల్ఫాహార విందుకు హాజరవుతారు. 10 గంటల నుంచి 11 వరకూ స్వర్ణభారత్‌ట్రస్ట్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలను అందజేయడంతో పాటూ ఎలీప్‌ సంస్థకు చెందిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చిన్న పిల్లల వినికిడి సంబంధిత సమస్యలకు వైద్యం అందించే ఉచిత శిబిరాన్ని ప్రారంభిస్తారు. రాత్రి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లోనే బస చేసి మరుసటి రోజు జనవరి 1న కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి ఢిల్లీకి బయలుదేరానున్నారు.