అమరావతి, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ఉపాద్యాయ అర్హత పరీక్ష టెట్ వాయిదా పడే అవకాశం ఉంది. టెట్ షెడ్యుల్ విడుదలకు పరీక్ష నిర్వహణకు మధ్య సమయం తక్కువగా ఉందని, పరీక్షకు చదివేందుకు సమయం సరిపోదని ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని సర్కారు యోచిస్తుంది. షెడ్యుల్ ప్రకారం అన్ లైన్ పరీక్ష జనవరి 17 నుంచి 27వరకు జరగాలి. దీన్ని మరో 15రోజులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.